రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..

2 comments
‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది.

 ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.

వరుసకు అన్నాచెల్లెళ్లు.. కానీ ప్రేమించుకున్నారు

0 comments
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే సంఘటనలు చాలాచిత్రంగా అనిపిస్తాయి. సాధ్యమా అనిపించేలా ఉన్న ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేదైనా ఫర్లేదుకానీ.. చూస్తూ.. చూస్తూ ఇలాంటివి ఎలా ఒప్పుకుంటామని పిల్ల.. పిల్లాడి తల్లిదండ్రులు గట్టిగా చెప్పటం.. తాను కోరుకున్న ప్రేమ లభించకపోవటంతో సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాస్త చిత్రంగా.. మరికాస్త ఇబ్బందిగా  అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన 20 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రేమలో పడింది. కుర్రాడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో.. ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయంపై ఇరు వర్గాల పెద్దలకు తెలిసి.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపారు. వీరి వ్యవహారం ఇరు వర్గాల పెద్దల మధ్య గొడవలకు కారణమైంది. యువతికి తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె ససేమిరా అనటంతో ఈ వ్యవహారాన్నిఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

మరోవైపు.. ఈ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు సదరు యువతి వాంగ్మూలం తీసుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కావటంతో కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.
Copyright © ఆకాశ గంగ