క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సైనా నేహ్వాల్

ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ బాడ్మింటన్‌లో భారత నెంబర్‌వన్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. రెండవ రౌండ్‌లో మలేషియాకు చెందిన లిడియా ఛీపై 21-15, 21-17 స్కోరు తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్యూ యిన్, తైపై క్రీడాకారిణి మా సియా పాయ్‌ల మధ్య జరిగే పోటీలో గె లుపొందిన వారితో తలపడనుంది.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ